తెలంగాణాలో విద్యార్థులకు టీడీ వ్యాక్సినేషన్

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (14:40 IST)
ధనుర్వాతం, కంఠసర్పి వ్యాధుల నుంచి చిన్నారుల నుంచి విద్యార్థులకు రక్షణ కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం నుంచి టీడీ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 7వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్నికొనసాగిస్తుంది. 
 
జిల్లా వ్యాప్తంగా 5వ తరగతి, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు టీడీ వ్యాక్సిన్ ఇస్తారు. జిల్లాలో 23 పీహెచ్‌సీలో, 2 యూఎచ్‌సీలు ఉన్నాయి. ఈ కేంద్రాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, గురుకుల పాఠశాలలు 1075 ఉండగా, ఆ పాఠశాలల్లో 5, 10 తరగతలు చదువుతున్న విద్యార్థులు 31,854 మంది ఉన్నారు. 
 
వీరిలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు 15,696 మంది ఉన్నారు. వీరికే కాకుండా ఇతర బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ వ్యాక్సిన్ వేయనున్నారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వైద్యాధికారులు, ఆర్బీఎకే, ఆయుష్ వైద్యులు, సూపర్ వైజర్లు, ఏఎన్ఎస్‌లు, ఆశా వర్కర్లు, భాగస్వాములు కానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments