Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాముకుంటలో విషాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురి మృతి

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం పాముకుంటలో పెను విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు అనుమానాస్పదంగా చనిపోయారు.

Webdunia
శుక్రవారం, 22 డిశెంబరు 2017 (08:59 IST)
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం పాముకుంటలో పెను విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు అనుమానాస్పదంగా చనిపోయారు. వీరంతా కోళ్లఫారం వద్ద నివాసగృహంలో వీరు విగత జీవులుగా పడిఉన్నారు. మృతులను బచ్చలి బాలనర్సయ్య (65), భారతమ్మ (58), దంపతులు బాలరాజు (44), నిర్మల (39) సహా ఇద్దరు కుమారులు చింటూ (12), బన్ని (8), కుమార్తె శ్రావణి (14)లుగా గుర్తించారు. 
 
జనగాం జిల్లా స్టేషన్ ఘన్‌‍పూర్ మండలం తరిగొప్పుల గ్రామానికి చెందిన వీరంతా నెల రోజుల క్రితం కోళ్లఫారంలోనే పనికి కుదిరారు. రాత్రి భుజించిన చికెన్ విషతుల్యం కావడం వల్లే మరణించివుంటారని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

షారూక్‌ ఖాన్‌ను ఉత్తమ నటుడు అవార్డు ఎలా ఇస్తారు? నటి ఊర్వశి ప్రశ్న

టాలీవుడ్‌ డైరెక్టర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉమెన్ సెంట్రిక్ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments