పాత బస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం... : బండి సంజయ్

Webdunia
మంగళవారం, 24 నవంబరు 2020 (15:26 IST)
బల్దియా ఎన్నికల ప్రచారంలో భాగంగా, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్థాన్ వాసులు ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ గెలవగానే పాతబస్తీలో సర్టికల్ స్ట్రైక్ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
మంగళవారం నగరంలోని ఉప్పల్, రామంతపూర్‌లో సంజయ్‌ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో వివాదాస్పద ప్రసంగం చేశారు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. 
 
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ విజయంసాధించి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. 
 
ఈ సంర్భంగా మాట్లాడుతూ '1948లో హైదరాబాద్‌ను పాకిస్థానులో కలపాలని ఎంఐఎం కోరింది. బిహార్ ఎన్నికల్లో గెలిచిన ఎంఐఎం ఎమ్మెల్యే హిందుస్తాన్ పేరుతో ప్రమాణ స్వీకారం చేయనని చెప్పారు. ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్.. పాత బస్తీలో ఓట్ కట్టారు పార్టీగా మారింది. 
 
ఢిల్లీ మున్సిపాలిటీలో 30 ఏళ్లుగా బీజేపీ గెలుస్తూ వస్తుంది. బీజేపీ గెలిచిన చోట ఎక్కడా మతవిద్వేషాలు లేవు. బీజేపీ చెప్పింది చేస్తుంది. హైదరాబాద్ ఎన్నికల్లో సునామీ రాబోతుంది. ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉండదు' అని అన్నారు. 
 
అంతేకాకుండా, ఎంఐఎం పార్టీ ఒక ఉగ్ర సంస్థ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నారని అన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దే తమ అడ్డా పెడతామన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, ఇక్కడ రోహింగ్యాలు ఉన్నట్టైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments