తిరుపతి సీటిస్తే మా తడాఖా చూపిస్తాం.. పవన్ : మోకాలొడ్డుతున్న బీజేపీ!

Webdunia
మంగళవారం, 24 నవంబరు 2020 (15:20 IST)
తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఇటీవల కరోనా వైరస్ సోకి మృతి చెందారు. దీంతో ఈ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం వైకాపా తరపున అభ్యర్థిని కూడా ఆ పార్టీ ప్రకటించింది. అలాగే, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ వంటి పార్టీలు కూడా తమతమ అభ్యర్థుల పేర్లను ప్రకటించే పనిలో నిమగ్నమైవున్నారు.
 
ఈ నేపథ్యంలోఉప ఎన్నిక జరిగే తిరుపతి లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ అధిష్టానంతో చర్చించేందుకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో కలసి పవన్‌ కల్యాణ్‌ సోమవారం ఢిల్లీ వెళ్లారు. 
 
తెలంగాణలోని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి సహకారం అందించేందుకు సిద్ధమయ్యామని, అందువల్ల తిరుపతిలో తమకు అవకాశం ఇవ్వాలని ఆయన బీజేపీ పెద్దలను కోరనున్నారు. 
 
గతంలో తిరుపతిలో ప్రజారాజ్యం తరపున చిరంజీవి శాసనసభకు పోటీ చేసి విజయం సాధించిన వైనాన్ని, అక్కడ ఓ బలమైన సామాజికవర్గం ఆది నుంచి జనసేనకు అండగా ఉంటున్న విషయాన్ని పవన్‌ బీజేపీ అధిష్ఠానానికి వివరించనున్నారని చెబుతున్నారు. 
 
అయితే తిరుపతిని తమ బలమైన స్థావరంగా భావిస్తున్న బీజేపీ ఆ స్థానాన్ని వదులుకుంటుందా అనే సందేహాలు కూడా ఉన్నాయి. పైగా, తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి విజయకేతనం ఎగురవేయాలని భావిస్తోంది. అందుకే ఈ స్థానాని వదిలిపెట్టేందుకు ఏపీ బీజేపీ నేతలు ఏమాత్రం సముఖంగా లేరు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments