Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో 40 కి.మీ వేగం దాటితే జేబుకు చిల్లే...

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (08:41 IST)
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరుగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన నగరంలో ఏర్పడే ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై దృష్టిసారించారు. ముఖ్యంగా, అతివేగ వాహనదారులకు కళ్లెం వేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఇందులోభాగంగా, జీహెచ్ఎంసీ పరిధిలో వాహనాల వేగం 40 కిలోమీటర్లు దాటడానికి వీల్లేదని హుకుం జారీచేశారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ ఆదేశించారు. 
 
అన్ని రకాల వాహనాలు ఇదే వేగంతో నడపాలని ఆదేశించారు. ఒకవేళ ఈ వేగ పరిమితి దాటిన పక్షంలో రూ.1035కు ఈ-చలాన్ ఆటోమేటిగ్గా జనరేట్ అవుతుందని ఆయన జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. ప్రధానంగా కూకట్‌పల్లి జేఎన్టీయూ సర్కిల్, జుబ్లీహిల్స్ చెక్క పోస్ట్, హైటెక్ సిటీ క్రాస్ రోడ్డు, ట్యాంక్ బండ్ రోడ్డు, సుచిత్రా జంక్షన్‌లలో ఈ వేగం పరిమిని ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. 
 
వాహనాల వేగాన్ని స్పీడ్ గన్స్‌ నిర్ధారిస్తాయని పేర్కొన్నారు. అయితే, ప్రధాన జంక్షన్‌‍లలో స్పీడ్ గన్స్‌ను అమర్చడాన్న భాగ్యనగరి వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ, పోలీసులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ముందుకే వెళుతున్నారు. 40 కిలోమీటర్ల వేగ పరిమితిని దాటితే సీసీటీవీ కెమెరాలు ఆటోమేటిగ్గా కఈ-చలాన్‌ను జనరేట్ చేస్తాయని పోలీసులు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments