Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరా ప్రయాణికులకు శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (13:46 IST)
దసరా సెలవుల కోసం తమ సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. జంట నగరాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు దసరా స్పెషల్ పేరుతో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు ప్రకటించింది. ఈ రైళ్లు కూడా శుక్రవారం నుంచే అందుబాటులో ఉంటాయని తెలిపింది. అలాగే, రోజువారీగా నడిచే రైళ్లలో కొన్నింటి సమయాల్లో సవరణలు చేయడం జరిగిందని, అందువల్ల ప్రయాణికులు ఇంటి నుంచి బయలుదేరేముందు విచారించుకుని స్టేషన్‌కు రావాలని ద.మ.రై అధికారులు తెలిపారు. 
 
శుక్రవారం సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చి మధ్య 07645 నంబరుతో ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు పేర్కొంది. శనివారం సంత్రాగచ్చి నుంచి సికింద్రాబాద్‌కు 07646 నంబరుతో ప్రత్యేక రైలు వస్తుందని తెలిపింది.
 
అలాగే, అక్టోబరు రెండో తేదీన సికింద్రాబాద్ - షాలిమార్‌ల మధ్య 07741 నంబరుతోను, అక్టోబరు 3వ తేదీన షాలిమార్ - సికింద్రాబాద్‌ల మధ్య 07742 నంబరుతో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు పేర్కొంది. 
 
అక్టోబరు, 1, 8 తేదీల్లో కూడా నాందేడ్ - బర్హంపూర్ (07431), త్రివేండ్రం - టాటా నగర్ (06192), అక్టోబరు 2, 9 తేదీల్లో బర్హంపూర్ - నాందేడ్ (07432), అక్టోబరు 4, 11 తేదీల్లో టాటా నగర్ - త్రివేండ్ర (06191) మధ్య ప్రత్యేక రైళ్లను నడిపేలా చర్యలు తీసుకున్నట్టు దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments