దసరా ప్రయాణికులకు శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (13:46 IST)
దసరా సెలవుల కోసం తమ సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. జంట నగరాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు దసరా స్పెషల్ పేరుతో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు ప్రకటించింది. ఈ రైళ్లు కూడా శుక్రవారం నుంచే అందుబాటులో ఉంటాయని తెలిపింది. అలాగే, రోజువారీగా నడిచే రైళ్లలో కొన్నింటి సమయాల్లో సవరణలు చేయడం జరిగిందని, అందువల్ల ప్రయాణికులు ఇంటి నుంచి బయలుదేరేముందు విచారించుకుని స్టేషన్‌కు రావాలని ద.మ.రై అధికారులు తెలిపారు. 
 
శుక్రవారం సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చి మధ్య 07645 నంబరుతో ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు పేర్కొంది. శనివారం సంత్రాగచ్చి నుంచి సికింద్రాబాద్‌కు 07646 నంబరుతో ప్రత్యేక రైలు వస్తుందని తెలిపింది.
 
అలాగే, అక్టోబరు రెండో తేదీన సికింద్రాబాద్ - షాలిమార్‌ల మధ్య 07741 నంబరుతోను, అక్టోబరు 3వ తేదీన షాలిమార్ - సికింద్రాబాద్‌ల మధ్య 07742 నంబరుతో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు పేర్కొంది. 
 
అక్టోబరు, 1, 8 తేదీల్లో కూడా నాందేడ్ - బర్హంపూర్ (07431), త్రివేండ్రం - టాటా నగర్ (06192), అక్టోబరు 2, 9 తేదీల్లో బర్హంపూర్ - నాందేడ్ (07432), అక్టోబరు 4, 11 తేదీల్లో టాటా నగర్ - త్రివేండ్ర (06191) మధ్య ప్రత్యేక రైళ్లను నడిపేలా చర్యలు తీసుకున్నట్టు దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments