Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరా ప్రయాణికులకు శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (13:46 IST)
దసరా సెలవుల కోసం తమ సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. జంట నగరాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు దసరా స్పెషల్ పేరుతో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు ప్రకటించింది. ఈ రైళ్లు కూడా శుక్రవారం నుంచే అందుబాటులో ఉంటాయని తెలిపింది. అలాగే, రోజువారీగా నడిచే రైళ్లలో కొన్నింటి సమయాల్లో సవరణలు చేయడం జరిగిందని, అందువల్ల ప్రయాణికులు ఇంటి నుంచి బయలుదేరేముందు విచారించుకుని స్టేషన్‌కు రావాలని ద.మ.రై అధికారులు తెలిపారు. 
 
శుక్రవారం సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చి మధ్య 07645 నంబరుతో ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు పేర్కొంది. శనివారం సంత్రాగచ్చి నుంచి సికింద్రాబాద్‌కు 07646 నంబరుతో ప్రత్యేక రైలు వస్తుందని తెలిపింది.
 
అలాగే, అక్టోబరు రెండో తేదీన సికింద్రాబాద్ - షాలిమార్‌ల మధ్య 07741 నంబరుతోను, అక్టోబరు 3వ తేదీన షాలిమార్ - సికింద్రాబాద్‌ల మధ్య 07742 నంబరుతో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు పేర్కొంది. 
 
అక్టోబరు, 1, 8 తేదీల్లో కూడా నాందేడ్ - బర్హంపూర్ (07431), త్రివేండ్రం - టాటా నగర్ (06192), అక్టోబరు 2, 9 తేదీల్లో బర్హంపూర్ - నాందేడ్ (07432), అక్టోబరు 4, 11 తేదీల్లో టాటా నగర్ - త్రివేండ్ర (06191) మధ్య ప్రత్యేక రైళ్లను నడిపేలా చర్యలు తీసుకున్నట్టు దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments