Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులు నిల్... రద్దవుతున్న రైళ్లు

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (10:43 IST)
దేశంలో కరోనా వైరస్ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారినపడి అనేక మంది మృత్యువాతపడ్డారు. వీటితో పాటు.. పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలు అమలవుతున్నాయి. వీటితో పాటు ఇతర ఆంక్షల కారణంగా చాలా మంది ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటుండడంతో రైళ్లు బోసిపోతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ మీదుగా ప్రయాణించే ఆరు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నిన్న తాత్కాలికంగా రద్దు చేసింది. విశాఖపట్టణం-కడప (07488) రైలును నేటి నుంచి ఈ నెల 31 వరకు రద్దు చేయగా, కడప-విశాఖ రైలు (07487)ను రేపటి నుంచి జూన్ 1 వరకు రద్దు చేసింది. 
 
అలాగే, విశాఖ-లింగంపల్లి (02831), లింగంపల్లి-విశాఖ (02832) రైళ్లను రేపటి నుంచి వచ్చే నెల 1 వరకు నిలిపివేసింది. ముంబై సీఎస్‌టీ-ఆదిలాబాద్ (01141) ఎక్స్‌ప్రెస్‌ను 17వ తేదీ నుంచి, ఆదిలాబాద్-ముంబై సీఎస్‌టీ (01142) రైలును 18 నుంచి రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, ఈ రైళ్లను తిరిగి ఎప్పటి నుంచి పునరుద్ధరించేదీ వెల్లడించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments