Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి ఎక్సర్‌సైజ్ ఏంట్రా? మందలించిన తల్లిని చంపేశాడు

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (14:47 IST)
అర్థరాత్రి ఎక్సర్‌సైజ్ చేస్తుండగా తల్లి మందలించిందని నవమాసాలు మోసి కన్న తల్లినే కొడుకు కడతేర్చాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి 2.30 ప్రాంతంలో ఎక్సర్ సైజ్ చేస్తుండగా తల్లి మందలించింది. దీంతో సైకో కొడుకు సుధీర్ రాడ్‌తో తల్లిని తలపై కొట్టి చంపాడు. అడ్డు వచ్చిన చెల్లెను కూడా రాడ్‌తో కొట్టి చంపాడు. ఈ ఘటనపై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 
ఈ ఘటనలో సుధీర్ తల్లి పాపమ్మ మృతి చెందగా.. చెల్లికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన చెల్లిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు మృతి చెందిన పాపమ్మను మార్చురీకి తరలించారు. గతకొన్ని రోజులుగా సుధీర్ సైకోగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments