Webdunia - Bharat's app for daily news and videos

Install App

85 ఏళ్ల వృద్ధురాలికి బియ్యం-కిరోసిన్ ఇచ్చి వండుకోమన్నాడు... ఆమె అలా చేసింది...

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (16:10 IST)
కొడుకు భారంగా భావిస్తున్నాడని ఆవేదన చెందిన ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఉదంతం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండవెళ్లిలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే 85 ఏళ్ల అందే కౌసల్య అనే వృద్ధురాలికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరందరికీ వివాహం అయింది. కొన్ని సంవత్సరాల క్రితం పెద్ద కొడుకు మరణించడంతో ఆమె ఆరేళ్లుగా శామీర్‌పేట మండలం మజీద్‌పూర్‌లో నివసిస్తున్న తన చిన్నకుమారుడు బాస్కర్‌రెడ్డి వద్ద ఉంటోంది. 
 
తల్లిని భారంగా భావించిన అతను, తల్లిని వంతులువారీగా పెద్దకుమారుడి కుటుంబ సభ్యులతోపాటు ఉంచుకోవాలని కోరాడు. దానికి పెద్దకుమారుడి భార్య విముఖత వ్యక్తం చేయడంతో సోమవారం తల్లిని పెద్ద కుమారుడి ఇంటి వద్ద విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. కానీ అక్కడ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నందున చిన్న కుమారుడు గ్రామంలోని తన ఇంట్లోనే తల్లిని వేరుగా ఉంచి బియ్యం కిరోసిన్ అప్పగించి వండుకోమని చెప్పాడు. 
 
కొడుకు ప్రవర్తనకు మనస్థాపం చెందిన వృద్ధురాలు అతను ఇచ్చిన కిరోసిన్‌నే ఒంటి మీద పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందింది. ఈ ఘటనపై దుబ్బాక ఎస్‌ఐ సుబాష్‌గౌడ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments