Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకుంటానని సహజీవనం.. రూ.37లక్షలు గుంజేశాడు.. ఆపై పరార్

Webdunia
శనివారం, 24 ఏప్రియల్ 2021 (21:00 IST)
పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు.. ఓ యువకుడు. అంతే కాకుండా సహజీవనం చేసి ఆమె వద్ద రూ.37లక్షలు గుంజేశాడు. కానీ పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ కూకట్ పల్లిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ఆల్వాల్‌కు చెందిన మహిళ (26) రెండేళ్ల క్రితం విప్రో సంస్థలో ఉద్యోగంలో చేరింది. అక్కడ టీం లీడర్‌గా పని చేస్తున్న మూసాపేట ఆంజనేయనగర్‌కు చెందిన జై అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. అప్పటి నుంచి ఇద్దరూ సహజీవనం చేయసాగారు.
 
ఈ క్రమంలో సొంతంగా వ్యాపారం ప్రారంభిద్దామని చెప్పి ఆయువతి వద్దనుంచి జై రూ.37 లక్షల రూపాయలు తీసుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఆ యువతి కోరగా అప్పటి నుంచి ఆమెను తప్పించుకు తిరగసాగాడు. దీంతో బాధితురాలు ఏప్రిల్ 3న కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
 
బాధిత యువతి కేసు పెట్టిందని తెలుసుకున్న జై అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. జై కోసం గాలిస్తున్న పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడి అకౌంట్ లో ఉన్న రూ. 32 లక్షలను ఫ్రీజ్ చేసి రిమాండ్ కు తరలించారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments