Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగరేణి బొగ్గు గనుల్లో మోగిన సమ్మె సైరన్

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (13:18 IST)
తెలంగాణా రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనుల్లో సమ్మె సైరెన్ మోగింది. ఇదే అంశంపై సింగరేణి యాజమాన్యానికి కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు. సింగరేణి సంస్థను కేంద్రం ప్రైవేటీకరించబోతుందన్న వార్తల నేపథ్యంలో వారు సమ్మెకు దిగనున్నారు. 
 
ఇందులోభాగంగా ఈ నెల 28, 29వ తేదీల్లో సమ్మె చేబట్టబోతున్నామని సింగరేణి యాజమాన్యానికి ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ కార్మిక సంఘాల ప్రతినిధులు సంతకాలు చేసిన సమ్మె నోటీసులు అందించారు. 
 
సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్పత్తి అయ్యే బొగ్గును నల్లబంగారంతో పోల్చుతారు. దీన్ని తవ్వే సమయంలో బొగ్గు గనుల్లో ఏర్పడే ప్రమాదాల్లో అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినప్పటికీ సింగరేణి బొగ్గు గనుల్లో కార్మికులు పని చేస్తూ నల్లబంగారాన్ని వెలికి తీస్తున్నారు. 
 
అలాంటి నల్ల బంగారం గనులను కేంద్రం ప్రైవేటీకరించాలని చూస్తోంది. దీన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదే అంశంపై తమ నిరసన తెలిపేందుకు వీలుగా ఈ నెలాఖరులో రెండు రోజుల పాటు సమ్మె చేపట్టాలని నిర్ణయించి, నోటీసులు ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments