Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య తల నరికి మరో వ్యక్తి ఇంటి గుమ్మంలో వేసిన భర్త!!

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (15:25 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి కసాయిగా మారిపోయాడు. అనుమానం పెనుభూతమైంది. దీంతో భార్య తల తెగనరికేశాడు. ఆ తలను తీసుకెళ్లి మరో వ్యక్తి ఇంటి గుమ్మంలో వేశాడు. ఈ భయానక దారుణం గురించిన వివరాలను పరిశీలిస్తే... 
 
నారాయణఖేడ్‌ ప్రాంతానికి చెందిన సాయిలు అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 50 ఏళ్ల సాయిలు ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్నాడు. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానిస్తూ ఆమెను మానసికంగా వేధిస్తూ, గొడవపడుతూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అపుడు కసితో రగిలిపోయిన సాయిలు... భార్య తలను గొడ్డలితో నరికాడు. రక్తమోడుతున్న భార్య తలతో బైకుపై ఐదు కిలోమీటర్లు ప్రయాణించి, ఆ తలను తీసుకువెళ్లి, భార్య ఎవరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని తాను అనుమానిస్తున్నాడో ఆ వ్యక్తి ఇంటి గుమ్మంలో పడేశాడు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సాయిలును అరెస్ట చేశారు. స్థానికంగా ఈ ఘటన భయభ్రాంతులకు గురిచేసింది. కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments