Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య తల నరికి మరో వ్యక్తి ఇంటి గుమ్మంలో వేసిన భర్త!!

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (15:25 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి కసాయిగా మారిపోయాడు. అనుమానం పెనుభూతమైంది. దీంతో భార్య తల తెగనరికేశాడు. ఆ తలను తీసుకెళ్లి మరో వ్యక్తి ఇంటి గుమ్మంలో వేశాడు. ఈ భయానక దారుణం గురించిన వివరాలను పరిశీలిస్తే... 
 
నారాయణఖేడ్‌ ప్రాంతానికి చెందిన సాయిలు అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 50 ఏళ్ల సాయిలు ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్నాడు. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానిస్తూ ఆమెను మానసికంగా వేధిస్తూ, గొడవపడుతూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అపుడు కసితో రగిలిపోయిన సాయిలు... భార్య తలను గొడ్డలితో నరికాడు. రక్తమోడుతున్న భార్య తలతో బైకుపై ఐదు కిలోమీటర్లు ప్రయాణించి, ఆ తలను తీసుకువెళ్లి, భార్య ఎవరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని తాను అనుమానిస్తున్నాడో ఆ వ్యక్తి ఇంటి గుమ్మంలో పడేశాడు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సాయిలును అరెస్ట చేశారు. స్థానికంగా ఈ ఘటన భయభ్రాంతులకు గురిచేసింది. కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments