Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూస్ ఛానెళ్లకు రేటింగ్స్‌ ఆపేసిన బార్క్ బోర్డ్.. ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (15:06 IST)
న్యూస్ ఛానెళ్లకు రేటింగ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది బార్క్ బోర్డ్. రేటింగ్ కోసం న్యూ ఛానల్స్ పాకులాడుతున్నాయని ఆరోపణలు రావడంతో బార్క్ బోర్డ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంకా దీనిపై టెక్నికల్ కమిటీని నియమిస్తోంది. ఈ కమిటీ ప్రస్తుతం డేటాను కొలిచి, నివేదించడంలో ఉన్న ప్రమాణాలను పరిశీలించడంతో పాటు, ఇళ్లలోకి చొరబడి రేటింగ్స్‌ను తారుమారు చేసే అక్రమాలను అడ్డుకోవడానికి సూచనలు చేస్తుంది.
 
ఇంగ్లీష్, హిందీ, ప్రాంతీయ ఛానెళ్లతో పాటు బిజినెస్ ఛానెళ్లలో వెంటనే టెక్నికల్ కమిటీ చర్యలు మొదలవుతాయి. మొదట న్యూస్ జానర్‌లో ఉన్న ఛానెళ్లను ఈ కమిటీ పరిశీలించనుంది. ప్రస్తుతం కమిటీ పరిశీలన ఉండటంతో అన్ని న్యూస్ ఛానెళ్ల వీక్లీ ఇండివిజ్యువల్ రేటింగ్స్‌ను బార్క్ నిలిపివేస్తోంది. బార్క్ టెక్నికల్ కమిటీ పరిశీలన, పర్యవేక్షణ, ఇతర ప్రక్రియంతా పూర్తవడానికి కనీసం 8 నుంచి 12 వారాల సమయం పడుతుంది. కాబట్టి అప్పటి వరకు న్యూస్ ఛానెళ్ల రేటింగ్స్ రావు.
 
ఇటీవలి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ విరామం అవసరం అని బార్క్ బోర్డ్ భావించింది. ఇప్పటికే అమలు చేస్తున్న కఠినమైన ప్రోటోకాల్స్‌ని మరోసారి సమీక్షించడం బార్క్ ఇండియా దగ్గరగా పనిచేస్తుందని బార్క్ ఇండియా బోర్డ్ ఛైర్మన్ పునీత్ గోయెంకా తెలిపారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments