Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌ గేమ్స్‌తో రూ.36 లక్షలు స్వాహా... ఫ్రీ ఫైర్ ఆడుతూ...

Webdunia
శనివారం, 4 జూన్ 2022 (17:42 IST)
ఆన్‌లైన్‌ గేమ్స్‌తో రూ.36 లక్షలు స్వాహా అయ్యింది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అంబర్‌పేట్‌కు చెందిన ఓ బాలుడు (16) తన తాత మొబైల్‌ తీసుకొని అందులో ఆన్‌లైన్ గేమ్ ఫ్రీ ఫైర్‌ గేమింగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత తాత ఫోన్‌లో ఉన్న తన తల్లి అకౌంట్‌ నుంచి మొదటగా రూ.1,500 పెట్టి ఆట ఆడటం మొదలుపెట్టాడు.
 
ఆ తర్వాత రూ .10 వేల చొప్పున డబ్బులు పెట్టాడు. అలా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నుంచి రూ.9 లక్షలపాటు గేమ్‌ను ఆడాడు. అంతటితో ఆగకుండా.. ఎస్‌బీఐ బ్యాంక్‌ ఖాతాలోంచి ఒకసారి రూ.2 లక్షలు, మరోమారు రూ.1.60 లక్షలు, రూ.1.45 లక్షలు, ఇలా విడతల వారీగా రూ.27 లక్షలతో ఫ్రీ ఫైర్‌ గేమ్ ఆడాడు. అయితే.. బాలుడి తల్లి తనకు డబ్బులు అవసరమై బ్యాంక్‌కు వెళ్లగా.. అకౌంట్ ఖాళీ అంటూ అధికారులు చెప్పడంతో ఆమె షాకైంది.
 
వెంటనే లబోదిబోమంటూ బాధితురాలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఆయన మృతి అనంతరం వచ్చిన డబ్బు ఇదేనంటూ బాలుడి తల్లి పోలీసులతో చెప్పి వాపోయింది. ఎలాగైనా తనకు న్యాయం చేయాంటూ పోలీసులను కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments