Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌ గేమ్స్‌తో రూ.36 లక్షలు స్వాహా... ఫ్రీ ఫైర్ ఆడుతూ...

Webdunia
శనివారం, 4 జూన్ 2022 (17:42 IST)
ఆన్‌లైన్‌ గేమ్స్‌తో రూ.36 లక్షలు స్వాహా అయ్యింది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అంబర్‌పేట్‌కు చెందిన ఓ బాలుడు (16) తన తాత మొబైల్‌ తీసుకొని అందులో ఆన్‌లైన్ గేమ్ ఫ్రీ ఫైర్‌ గేమింగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత తాత ఫోన్‌లో ఉన్న తన తల్లి అకౌంట్‌ నుంచి మొదటగా రూ.1,500 పెట్టి ఆట ఆడటం మొదలుపెట్టాడు.
 
ఆ తర్వాత రూ .10 వేల చొప్పున డబ్బులు పెట్టాడు. అలా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నుంచి రూ.9 లక్షలపాటు గేమ్‌ను ఆడాడు. అంతటితో ఆగకుండా.. ఎస్‌బీఐ బ్యాంక్‌ ఖాతాలోంచి ఒకసారి రూ.2 లక్షలు, మరోమారు రూ.1.60 లక్షలు, రూ.1.45 లక్షలు, ఇలా విడతల వారీగా రూ.27 లక్షలతో ఫ్రీ ఫైర్‌ గేమ్ ఆడాడు. అయితే.. బాలుడి తల్లి తనకు డబ్బులు అవసరమై బ్యాంక్‌కు వెళ్లగా.. అకౌంట్ ఖాళీ అంటూ అధికారులు చెప్పడంతో ఆమె షాకైంది.
 
వెంటనే లబోదిబోమంటూ బాధితురాలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఆయన మృతి అనంతరం వచ్చిన డబ్బు ఇదేనంటూ బాలుడి తల్లి పోలీసులతో చెప్పి వాపోయింది. ఎలాగైనా తనకు న్యాయం చేయాంటూ పోలీసులను కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments