భిక్షగాడు కృత్రిమ కాలులో కరెన్సీ.. వామ్మో...

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (12:04 IST)
అతడి పేరు షరీఫ్ సాబ్.. దాదాపు 15 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వలస వెళ్లి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ సమీపంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని వయస్సు 75 సంవత్సరాలు. రైల్వే స్టేషన్‌ సమీపంలో ఫుట్‌పాత్‌పై చిన్న గుడిసె వేసుకుని ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. బెంగుళూరు వచ్చిన తొలినాళల్లో కూలీ పనులు చేసినా, అనారోగ్యం కారణంగా భిక్షాటనే వృత్తిగా మార్చుకున్నాడు. 
 
కొంతకాలనికి గాంగ్రిన్‌ కారణంగా షరీఫ్‌ సాబ్ కుడికాలు తొలగించి ఆ స్థానంలో కృత్రిమ కాలును ఏర్పాటు చేసింది ఓ స్వచ్చంద సంస్థ. షరీష్ బిచ్చమెత్తుకోగా వచ్చిన డబ్బును కృత్రిమ కాలులోనే దాచుకునేవాడు. మంగళవారం ఉదయం కంటోన్మెంట్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని పబ్లిక్‌ టాయ్‌లెట్‌కు వెళ్లిన అతను అక్కడే హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని పరిశీలించిన రైల్వే పోలీసులు చనిపోయినట్లు నిర్థారించి హై గ్రౌండ్‌ ఠాణాకు సమాచారం అందించారు.
 
మృతదేహాన్ని తరలించే సమయంలో అతని కృత్రిమ కాలు బరువుగా అనిపించడంతో తీసి చూడగా అందులో 42 రూ.500 నోట్లు, 470 రూ.100 నోట్లు, 20 రూ.200 నోట్లు, 215 రూ.50 నోట్లు, 430 రూ.20 నోట్లు, 528 రూ.10 నోట్లతో కలిపి మొత్తం రూ.96,780 లెక్కతేలింది. అతడి వివరాలు ఆరా తీయగా అతడి పేరు షరీఫ్‌ సాబ్‌గాను, స్వస్థలం హైదరాబాద్‌ అని బయటపడింది. నగదుతో పాటు మృతదేహాన్ని అప్పగించేందుకు షరీఫ్‌ సంబంధీకుల వివరాలు ఆరా తీస్తున్నట్లు తెలయజేశారు గ్రేహౌండ్స్ పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పిల్లలను వదిలేశాడు.. ఆ పిల్లల తల్లిని అతని సోదరుడు వేధించాడు.. పవన్‌పై పూనమ్ ఫైర్

క్యాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ .. ఇండస్ట్రీ అద్దం లాంటిది

స్పిరిట్ చిత్రంలో ప్రభాస్‌తో మెగాస్టార్ చిరంజీవి నటిస్తారా?

అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చిన మెగాస్టార్

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి అదిరిపోద్ది సంక్రాంతి ఫుల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments