సీఎం కేసీఆర్ అహంకారం దించేందుకే పాదయాత్ర చేస్తున్నా: షర్మిల

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (23:11 IST)
సీఎం కేసీఆర్ అహంకారం దించేందుకే పాదయాత్ర చేస్తున్నాని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ప్రకటించారు. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ వైఎస్సార్ చేసిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఒక చరిత్ర అని తెలిపారు.


ఇదే చేవెళ్ల గడ్డ నుంచి 18 ఏళ్ల క్రితం తొలి అడుగు పడిందని గుర్తుచేశారు. ప్రతి పల్లెకు వస్తా.. వారితో మమేకం అవుతానని ప్రకటించారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతానికే ఈ పాదయాత్ర చేస్తున్నానని స్పష్టం చేశారు. కేసీఆర్ అవినీతిని బయట పెడతానని హెచ్చరించారు. కేసీఆర్‌కు అమ్ముడుపోయిన కాంగ్రెస్‌ను చీల్చి చెండాడుతానని ప్రకటించారు. దేశంలోనే నెంబర్ వన్ అధ్వాన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని షర్మిల దుయ్యబట్టారు. 
 
 
‘‘వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. కళ్లముందు 1.90లక్షల ఉద్యోగాలు కనిపించినా నోటిఫికేషన్లు రావు. నిరుద్యోగులు హమాలీలుగా మారారు. ఏడేళ్లలో 30 వేల ఉద్యోగాలు పీకేశారు. తెలంగాణలో 800 శాతం దళితులపై దాడులు జరిగాయి.


మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. దమ్ముంటే కేసీఆర్ బీసీలకు ఏం చేశారో చెప్పాలి. నిజంగా సమస్యలు లేకుంటే నా ముక్కు నేలకు రాస్తా. సమస్యలుంటే రాజీనామా చేసి దళితుడిని సీఎం చేయాలి’’ అని షర్మిల డిమాండ్ చేశారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SriRam: ది మేజ్‌ నుంచి శ్రీరామ్‌ ఫస్ట్‌లుక్‌ అండ్‌ గ్లింప్స్‌

కొచ్చిలో ఒకొరగజ్జ ప్రచారాన్ని భగ్నం చేయడానికి వారే బాధ్యులు!

సీతా పయనం నుంచి పయనమే..మెలోడియస్, రొమాంటిక్ పాట విడుదల

ఓం శాంతి శాంతి శాంతిః రీమేక్ కనుక తరుణ్ చేయన్నాడు : సృజన్‌ యరబోలు

NTR: ఎన్‌టీఆర్ కు రక్ష‌ణ క‌ల్పించిన ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Marua leaves: మరువా తులసి ఔషధ గుణాలు.. ఇంట్లో వుంటే పాములు రావట!

ప్రియాంక మోహన్‌తో కలిసి హైదరాబాద్‌లో ఒకే రోజు 4 కొత్త స్టోర్‌లను ప్రారంభించిన కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ

వంట్లో వేడి చేసినట్టుంది, ఉప్మా తినాలా? పూరీలు తినాలా?

సంగారెడ్డిలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌ను మరింత విస్తరించటానికి చేతులు కలిపిన గ్రాన్యూల్స్ ఇండియా, సెర్ప్

వామ్మో Nipah Virus, 100 మంది క్వారెంటైన్, లక్షణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments