Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇడుపుల‌పాయ‌లో తండ్రి వై.ఎస్. స‌మాధిని నివాళి అర్పించి...

ఇడుపుల‌పాయ‌లో తండ్రి వై.ఎస్. స‌మాధిని నివాళి అర్పించి...
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 19 అక్టోబరు 2021 (15:25 IST)
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఇడుపులపాయకు చేరుకున్నారు. త‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌తో క‌లిసి ఆమె కడప విమానాశ్రయం చేరుకోగా, విమానాశ్రయం వద్దకు పెద్ద ఎత్తున వైఎస్ కుటుంబ అభిమానులు వారికి స్వాగ‌తం ప‌లికారు. అనంతరం రోడ్డు మార్గాన కాన్వాయ్ తో ఇడుపులపాయకు పయనమైన షర్మిల అక్క‌డ త‌న తండ్రి స‌మాధి వ‌ద్ద‌కు చేరుకున్నారు. వైఎస్ షర్మిల వెంట వైఎస్ విజయమ్మ, ఇతర పార్టీ నాయకులు వ‌చ్చారు. వైఎస్ షర్మిల , వైఎస్ విజయమ్మ, వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. 
 
వైఎస్సార్‌టీపీని అధికారికంగా ప్రకటించి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 20వ తేదీన చేవెళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పేరిట పాద యాత్రకు వైఎస్‌ షర్మిల శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి ఈ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు ష‌ర్మిల‌. ఇడుపుల‌పాయ గెస్ట్ హౌస్‌లో బస చేసి, తిరిగి సాయంత్రం ఇడుపులపాయ నుంచి హైదరాబాద్‌కు ష‌ర్మిల వెళ్లనున్నారు. ష‌ర్మిల చేవెళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పేరిట పాద యాత్ర విజ‌య‌వంతం కావాల‌ని వై.ఎస్. అభిమానులు ఆంకాంక్షిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిందీ వస్తేనే డబ్బులు రీఫండ్ చేస్తాం : జొమాటో కస్టమర్ సిబ్బంది