Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తుడుని బూతులు తిట్టి దాడి చేసిన పూజారి

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (16:23 IST)
ఆలయంలో స్వామి దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడి పట్ల పూజారి దురుసుగా ప్రవర్తించాడు. అతనిపై దాడి చేయడమేకాకుండా బూతుపురాణం చదివాడు. ఈ ఘటన సికింద్రాబాద్ నగరంలో జరిగి కలకలం రేపుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక ఉప్పల్‌లోని బాలాజీ హిల్స్‌కి చెందిన వాల్మీకి రావు గత రాత్రి 7 గంటల సమయంలో దర్శనం కోసం సికింద్రాబాద్ రైతిపైల్ బస్టాండ్‌కు సమీపంలోని గణేష్ ఆలయానికి వెళ్లాడు. 
 
ఆ తర్వాత పక్కనే ఉన్న చిన్నచిన్న గుడిలో దేవుళ్లను దర్శనం చేసుకునే క్రమంలో ఒక గుడిలోపలికి వెళ్లి దర్శనం చేసుకుంటున్న సమయంలో అనుమతి లేకుండా లోపలికి ఎందుకు వచ్చావ్ అంటూ పూజారి ప్రభాకర్ శర్మ బూతుల పురాణం అందుకున్నాడు. దీంతో వారిద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణే జరిగింది. 
 
ఆ తర్వాత ఆ భక్తుడిపై పూజారి చేయికూడా చేసుకున్నాడు. ఈ ఘటన గత ఆదివారం చోటు చేసుకోగా వీడియో ఫుటేజీల ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడికి సంబంధించి పూజారిపై భక్తుడు కేసు కూడా పెట్టాడు. దీంతో పోలీసులు పూజారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments