Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు.. దక్షిణ మధ్య రైల్వే

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (09:30 IST)
దేశంలో కరోనా వైరస్ దెబ్బకు అనేక రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. ఇయితే, ఇపుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో దేశ వ్యాప్తంగా ప్రజా రవాణా మెల్లగా పునరుద్ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కేంద్రంగా ఉండే దక్షిణ మధ్య రైల్వే నాలుగు ప్రత్యేక రైళ్లను నడపడానికి సన్నద్ధమయ్యింది. ప్రయాణికుల సౌకర్యం కోసం పలు మార్గాల్లో ఈ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. 
 
ఇందులో సికింద్రాబాద్ ‌- షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌ (02450) ప్రతి శుక్రవారం.. ఈ నెల 11, 18, 25, జూలై 2న నడుస్తుందని తెలిపింది. అదేవిధంగా షాలిమార్ ‌- సికింద్రాబాద్‌ (02449) రైలు ప్రతి బుధవారం.. ఈ నెల 9, 16, 23, 30 తేదీల్లో సేవలు అందిస్తుందని అధికారులు వెల్లడించారు. 
 
హౌరా - యశ్వంత్‌పూర్‌ రైలు (02469) ప్రతి గురువారం అంటే… ఈ నెల 10, 17, 24 తేదీల్లో, యశ్వంత్‌పూర్ ‌- హౌరా రైలు (02470) ప్రతి ఆదివారం అంటే… ఈ నెల 13, 20, 27 తేదీల్లో నడుస్తాయన్నారు. ఇవన్నీ రిజర్వేషన్‌ రైళ్లేనని తెలిపారు. 
 
కాగా, ప్రతి గురువారం నడిచే పట్నా - బన్సావాడి రైలు (03253)ను ఈ నెల 10 నుంచి, ప్రతి ఆదివారం నడిచే బన్సావాడి-పట్నా రైలు (03254)ను ఈ నెల 13 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments