మొరిగిన శునకం.. భయంతో మూడో అంతస్థు దూకేశాడు.. పరిస్థితి విషమం

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (17:10 IST)
ఫుడ్ డెలివరీ బాయ్ మూడో అంతస్థు నుంచి దూకేసిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫుడ్ డెలివరీ బాయ్‌కి పెంపుడు కుక్క మొరగడంతో భయంతో భవనం మూడో అంతస్థు నుంచి దూకి తీవ్ర గాయాలపాలయ్యాడు.
 
వివరాల్లోకి వెళితే.. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో పనిచేస్తున్న మహ్మద్ రిజ్వాన్ (23) పార్శిల్ డెలివరీ చేసేందుకు బంజారాహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్ భవనానికి వెళ్లాడు. ఫ్లాట్ తలుపు తట్టినప్పుడు, ఒక జర్మన్ షెపర్డ్ శునకం అరుస్తూ అతని వైపుకు వచ్చింది. 
 
దీంతో భయంతో రిజ్వాన్ మూడో అంతస్థు నుంచి దూకి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆపై ఫ్లాట్ యజమాని శోభన అంబులెన్స్‌కు ఫోన్ చేసి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)కి తరలించారు.
 
నగరంలోని యూసుఫ్‌గూడ ప్రాంతంలోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన రిజ్వాన్‌ పరిస్థితి విషమంగా ఉంది. రిజ్వాన్ సోదరుడు మహ్మద్ ఖాజా గురువారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments