అమ్మవారి దర్శనం కోసం వెళ్లి వస్తూ అనంతలోకాలకు .. ఆటోను వెనుక నుంచి ఢీకొట్టిన కారు

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (13:13 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలో ఓ కారు, ఆటోలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో తొమ్మిది మంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ప్రమాద వివరాలను పరిశీలిస్తే, కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన శశి భరత్ అనే వ్యక్తి కారును అతివేగంగా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆ సమయంలో కొమురవెల్లి దేవాలయం దర్శనం పూర్తిచేసుకుని గజ్వేల్ వైపు ఓ ఆటో వెళుతుంది. 
 
దీన్ని వెనుక నుంచి అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదం సరిగ్గా జిల్లాలోని కొండపాక మండలంలోని కొడకండ్ల గ్రామ శివారులో ఉన్న ఒక వంతెన వద్ద జరిగింది. 
 
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నాగమణి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గజ్వేల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments