Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మవారి దర్శనం కోసం వెళ్లి వస్తూ అనంతలోకాలకు .. ఆటోను వెనుక నుంచి ఢీకొట్టిన కారు

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (13:13 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలో ఓ కారు, ఆటోలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో తొమ్మిది మంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ప్రమాద వివరాలను పరిశీలిస్తే, కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన శశి భరత్ అనే వ్యక్తి కారును అతివేగంగా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆ సమయంలో కొమురవెల్లి దేవాలయం దర్శనం పూర్తిచేసుకుని గజ్వేల్ వైపు ఓ ఆటో వెళుతుంది. 
 
దీన్ని వెనుక నుంచి అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదం సరిగ్గా జిల్లాలోని కొండపాక మండలంలోని కొడకండ్ల గ్రామ శివారులో ఉన్న ఒక వంతెన వద్ద జరిగింది. 
 
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నాగమణి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గజ్వేల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments