Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ నలుగురి చేతిలో ఉంది.. 4 కోట్ల మంది ఏకం కావాలి : రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం నలుగురు సభ్యులు కలిగిన ఓ కుటుంబం చేతిలో ఉందని, వారి నుంచి విముక్తి కల్పించేందుకు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఏకం కావాల్సి ఉందని టీడీపీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి అన్నారు.

Webdunia
ఆదివారం, 29 అక్టోబరు 2017 (15:39 IST)
తెలంగాణ రాష్ట్రం నలుగురు సభ్యులు కలిగిన ఓ కుటుంబం చేతిలో ఉందని, వారి నుంచి విముక్తి కల్పించేందుకు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఏకం కావాల్సి ఉందని టీడీపీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి అన్నారు. 
 
టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఆదివారం ఉదయం నుంచి కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తనకు కార్యకర్తలు మాత్రమే తన అదిష్టానమని, వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటానని హామీ ఇచ్చారు. 
 
"తెలంగాణ సమాజం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి వ్యతిరేకంగా, ఆ కుటుంబంలోని నలుగురి దోపిడీకి వ్యతిరేకంగా నాలుగు కోట్ల మంది ప్రజలు పునరేకీకరణ కావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణ సమాజం వివిధ మొక్కలుగా విడిపోతే, కేసీఆర్‌కు రాజకీయ ప్రయోజనం చేకూరుతుంది. ఈ కేసీఆర్‌కు వ్యతిరేకంగా మన సమాజం పునరేకీకరణ జరగాలన్నారు.
 
అందువల్లే ఈ రోజు ఇంత బాధ అయినా, ఇంత ఇబ్బంది అయినా నిర్ణయం తీసుకున్నాను. నేను మొన్న వచ్చినప్పుడే చెప్పినా. నా అధిష్టానం ఎక్కడో లేదు. నా అధిష్టానం కొడంగల్ కార్యకర్తలే. మీరు ఇచ్చే ఆదేశాలను అమలు చేస్తా. మిమ్మల్ని అడగకుండా ఏ నిర్ణయం తీసుకోనని చెప్పినా" అని అన్నారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments