కోవిడ్ బారినపడిన కోలుకున్న చెర్రీ సతీమణి ఉపాసన

Webdunia
బుధవారం, 11 మే 2022 (14:58 IST)
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన కరోనా వైరస్ బారినపడ్డారు. దీనికి చికిత్స తీసుకున్న తర్వాత ఆమె ప్రస్తుతం కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. 
 
చెన్నైలో ఉన్న తాతయ్య, అమ్మమ్మల వద్దకు వెళ్లేందుకు కోవిడ్ పరీక్షలు చేయించుకోగా ఈ పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందన్నారు. అయితే, కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల స్వల్ప కరోనా లక్షణాలు మాత్రమే కనిపించాయని పేర్కొన్నారు. 
 
దీంతో అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నానని, చికిత్స సమయంలో పారాసిటమల్, విటమిన్ మాత్రలు మాత్రమే వేసుకుంటే సరిపోతుందని వైద్యులు చెప్పారన్నారు. 
 
తనకు కరోనా సోకడంతో బాడీ పెయిన్స్, జట్టు ఊడిపోవడం, నీరసం వంటి సమస్యలు రావొచ్చని కొందరు చెప్పారని అయితే, తనకు అలాంటి ఏ సమస్యా రాలేదని చెప్పారు. 
 
కోవిడ్ పరీక్షలు చేయించుకోకపోతే తనకు కరోనా వైరస్ సోకిందన్న విషయమే తెలిసేది కాదన్నారు. ఈ సందర్భంగా తనకు చికిత్స చేసిన వైద్యులు డాక్టర్ సుబ్బారెడ్డి, డాక్టర వీరప్రకాష్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments