Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్యావరణ రక్షణపై అవగాహన పెరగాలి: బాలీవుడ్ హీరో సంజయ్ దత్

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (22:48 IST)
ప్రకృతి పట్ల ప్రేమ కనబరుస్తూ, పర్యావరణ రక్షణపై అందరిలో అవగాహన పెరగాలని ఆకాంక్షించారు ప్రముఖ బాలీవుడ్ హీర్ సంజయ్ దత్. ప్రస్తుతం ప్రపంచం ముందు ఉన్న సవాళ్లలో పర్యావరణ రక్షణే అతి పెద్దదని, ఈ ముప్పు నుంచి బయటపడాలంటే, ఉన్న అడవులను కాపాడు కోవటంతో పాటు, కొత్తగా  పెద్ద ఎత్తున పచ్చదనం పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా (డిసెంబర్ -7) సంజయ్ దత్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ సంతోష్ తో కలిసి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని హైదరాబాద్ శిల్పారామంలో మొక్కలు నాటారు.

సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి తాను గతంలోనే విన్నానని, దేశ వ్యాప్తంగా పచ్చదనం పెంపు దిశగా ఆదర్శవంత కార్యక్రమం అని సంజయ్ దత్ మెచ్చుకున్నారు. ఇప్పుడు సంతోష్ పుట్టిన రోజు సందర్భంగా,  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముంబైలోనూ చేస్తాం, నా అభిమానులు,  సన్నిహితు లు పాల్గొంటారని తెలిపారు. 
 పర్యావరణ కాలుష్యం తగ్గించేందుకు, పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటడం, పెంచడాన్ని ప్రతీ ఒక్కరూ తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలని దత్ పిలుపు నిచ్చారు. 
 
తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మొక్కలు నాటిన అందరికీ ఎంపీ సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ప్రతీ ఒక్కరూ తాము నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవటంతో పాటు, మరో ముగ్గురితో నాటించి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చైన్ కొనసాగిస్తూ,  దేశ వ్యాప్తంగా మొక్కలు నాటే సంస్కృతి పెరిగేలా చూడాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments