Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్యావరణ రక్షణపై అవగాహన పెరగాలి: బాలీవుడ్ హీరో సంజయ్ దత్

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (22:48 IST)
ప్రకృతి పట్ల ప్రేమ కనబరుస్తూ, పర్యావరణ రక్షణపై అందరిలో అవగాహన పెరగాలని ఆకాంక్షించారు ప్రముఖ బాలీవుడ్ హీర్ సంజయ్ దత్. ప్రస్తుతం ప్రపంచం ముందు ఉన్న సవాళ్లలో పర్యావరణ రక్షణే అతి పెద్దదని, ఈ ముప్పు నుంచి బయటపడాలంటే, ఉన్న అడవులను కాపాడు కోవటంతో పాటు, కొత్తగా  పెద్ద ఎత్తున పచ్చదనం పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా (డిసెంబర్ -7) సంజయ్ దత్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ సంతోష్ తో కలిసి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని హైదరాబాద్ శిల్పారామంలో మొక్కలు నాటారు.

సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి తాను గతంలోనే విన్నానని, దేశ వ్యాప్తంగా పచ్చదనం పెంపు దిశగా ఆదర్శవంత కార్యక్రమం అని సంజయ్ దత్ మెచ్చుకున్నారు. ఇప్పుడు సంతోష్ పుట్టిన రోజు సందర్భంగా,  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముంబైలోనూ చేస్తాం, నా అభిమానులు,  సన్నిహితు లు పాల్గొంటారని తెలిపారు. 
 పర్యావరణ కాలుష్యం తగ్గించేందుకు, పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటడం, పెంచడాన్ని ప్రతీ ఒక్కరూ తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలని దత్ పిలుపు నిచ్చారు. 
 
తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మొక్కలు నాటిన అందరికీ ఎంపీ సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ప్రతీ ఒక్కరూ తాము నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవటంతో పాటు, మరో ముగ్గురితో నాటించి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చైన్ కొనసాగిస్తూ,  దేశ వ్యాప్తంగా మొక్కలు నాటే సంస్కృతి పెరిగేలా చూడాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments