Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తాం.. రాహుల్ గాంధీ

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (10:36 IST)
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా సంపదను దోచుకుంటోందని కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్‌ఎస్‌ పార్టీకి ఏటీఎంలా మారిందని ఆరోపించారు. తెలంగాణలో లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దోచుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ సొమ్మంతా దోచుకుంటుందన్నారు. 
 
భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలో రాహుల్ గాంధీ పర్యటించారు. మేడిగడ్డ ప్రాజెక్టును రాహుల్ పరిశీలించారు. మహదేవపూర్ మండలం అంబటిపల్లిలో నిర్వహించిన మహిళా సాధికారత సదస్సుకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. మహానుభావుల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు అని పేర్కొన్నారు.
 
బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒకవైపు, కాంగ్రెస్‌ మరోవైపు ఉన్నాయన్నారు. ప్రధాన పోటీ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే ఉందన్నారు. బీఆర్‌ఎస్‌కు బీజేపీ, ఎంఐఎం మద్దతు పలుకుతున్నాయన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని, బీఆర్‌ఎస్‌ను గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
 
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు రూ.2500 అందజేస్తామన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments