Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్రంపై దృష్టిసారించిన రాహుల్ గాంధీ

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (14:22 IST)
కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంపై దృష్టిసారించారు. ఈ రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందుకోసం ఆ రాష్ట్రంపై ఆయన ఫోకస్ పెట్టారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే యేడాది (2023)లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సమయాత్తం చేయాలని ఆయన భావిస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, ఆయన సోమవారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఇతర సీనియర్ నేతలు ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు. ఈ సమావేశాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్ని గ్రూపులకు చెందిన నేతలను అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది. ఇందులో పార్టీ బలోపేతం, ప్రజా ఉద్యమాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా పార్టీ గ్రూపు రాజకీయాలపై చర్చించనున్నారు. 
 
ప్రధానంగా ఈ భేటీకి టీపీసీసీ చీఫ్‌ను వ్యతితేరికిస్తున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మరో సీనియర్ నేత వి.హనుమంతరావులను ఆహ్వానించడంతో ఈ భేటీ వాడివేడిగా జరిగే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశం తర్వాత రాహుల్ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది. 
 
ఇదిలావుంటే, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఈ దఫా తెలంగాణ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా, కామారెడ్డి నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments