Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్‌ రెడ్డికి భద్రత పెంచండి... ఖర్చు ఆయనే భరించాలి... హైకోర్టు

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (19:13 IST)
టీ కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరిన విధంగానే ఆయనకు భద్రతను పెంచాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిని హైకోర్టు ఆదేశించింది. అయితే భద్రతకు అయ్యే ఖర్చును రేవంత్ రెడ్డే భరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. తనకు కేంద్ర సిబ్బందితో నిరంతరం నలుగురు ఉండేలా భద్రత కల్పించాలని కోరుతూ రేవంత్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ పైన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
 
రాష్ట్ర ప్రభుత్వంపై ముఖ్యంగా కేసీఆర్‌పై పోరాడుతున్నందున తనకు ప్రాణ హాని ఉందని రేవంత్ ఆరోపించారు. ఎన్నికల సమయం కాబట్టి తనకు 4+4 భద్రత కల్పించాలని కోరారు. తనకు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదని.. కేంద్ర భద్రత కావాలని ఈసీని, కేంద్రాన్ని కోరినప్పటికీ స్పందన లేదన్నారు.  వాదనల అనంతరం హైకోర్టు.. రేవంత్ రెడ్డి కోరిన విధంగా భద్రత పెంపును కల్పించాలని, ఖర్చులను ఆయనే భరించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas and Anushka: ప్రభాస్‌తో కలిసి నటిస్తాను అంటోన్న దేవసేన (video)

Krish: పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే.. - ఇప్పుడు సినిమా లైఫ్ మూడు గంటలే : క్రిష్ జాగర్లమూడి

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం