Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు హైదరాబాద్‌కు వస్తున్న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (11:11 IST)
రాష్ట్రపతి రాంనాథ్ కోవింజ్ ఆదివారం హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. నగర శివారు ప్రాంతమైన ముచ్చింతల్‌లో జరిగే రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలకు ఆయన హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ ప్రకటన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలతో పాటు పలువురు నేతలు వచ్చి పాల్గొన్నారు. 
 
ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఆదివారం మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఎయిర్ పోర్టులో రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం పలుకుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రాంనాథ్ కోవింద్ ముచ్చింతల్‌కు చేరుకుంటారు. 
 
అక్కడ 120 కిలో బంగారంతో తయారు చేసిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. సాయంత్రం 4 గంటలకు విగ్రహావిష్కరణ జరుగుతుంది. తర్వాత చినజీయర్ స్వామితో కలిసి సాయంత్రం 5 గంటల వరకు అక్కడ నిర్వహించే ఉత్సవాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. 
 
ఈ రాత్రికి ఆయన రాజ్‌భవన్‌లోనే బస చేస్తారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఆయన తిరిగి ఢిల్లీకి బయల్దేరుతారు. మరోవైపు రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ముచ్చింతల్ వైపు ఎవరూ రాకపోవడంతో పోలీసులు విన్నవిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments