Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిండుగర్భిణీకి కరోనా.. ఆపరేషన్ చేయనంటోన్న వైద్యులు

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (15:34 IST)
ఆదిలాబాద్ జిల్లాలో నిండుగర్భిణీకి కరోనా సోకింది. దీంతో ఆమెకు ఆపరేషన్ చేసేందుకు డాక్టర్లు నిరకరిస్తున్నారు. మరోవైపు అక్కడి నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఆ కుటుంబానికి ఆర్థిక స్థోమత లేని దయనీయ స్థితిలో ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని బీంపూర్ మండలం అందర్ బంద్ గ్రామానికి చెందిన ఓ నిండు గర్భిణి ప్రసవం కోసం రెండు రోజుల క్రితం రిమ్స్ ఆసుపత్రిలో చేరింది. 
 
అయితే సాధరణ ప్రసవం కాకపోవడంతో ఆమెకు ఆపరేషన్ చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. ఆపరేషన్‌కు ముందు కరోనా టెస్ట్ చేయడంతో గర్భిణికి పాజిటివ్ గా తేలింది. దీంతో ఆమెకు ఆపరేషన్ చేసేందుకు డాక్టర్లు వెనకంజవేస్తున్నారు.
 
దీంతో ఆపరేషన్ నిలిచిపోగా... మరోవైపు హైదరాబాద్ తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. అయితే అంతదూరం రావడానికి వారికి ఆర్థిక స్థోమత కూడ లేకపోవడంతో ఆసుపత్రిలోనే ప్రసవవేదన పడుతుంది. అయితే ఇదే విషయమై ఆసుపత్రి సూపరిండెంట్ మాత్రం వైద్యులను ఒప్పించి ఆపరేషన్ చేస్తామని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments