Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిండుగర్భిణీకి కరోనా.. ఆపరేషన్ చేయనంటోన్న వైద్యులు

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (15:34 IST)
ఆదిలాబాద్ జిల్లాలో నిండుగర్భిణీకి కరోనా సోకింది. దీంతో ఆమెకు ఆపరేషన్ చేసేందుకు డాక్టర్లు నిరకరిస్తున్నారు. మరోవైపు అక్కడి నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఆ కుటుంబానికి ఆర్థిక స్థోమత లేని దయనీయ స్థితిలో ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని బీంపూర్ మండలం అందర్ బంద్ గ్రామానికి చెందిన ఓ నిండు గర్భిణి ప్రసవం కోసం రెండు రోజుల క్రితం రిమ్స్ ఆసుపత్రిలో చేరింది. 
 
అయితే సాధరణ ప్రసవం కాకపోవడంతో ఆమెకు ఆపరేషన్ చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. ఆపరేషన్‌కు ముందు కరోనా టెస్ట్ చేయడంతో గర్భిణికి పాజిటివ్ గా తేలింది. దీంతో ఆమెకు ఆపరేషన్ చేసేందుకు డాక్టర్లు వెనకంజవేస్తున్నారు.
 
దీంతో ఆపరేషన్ నిలిచిపోగా... మరోవైపు హైదరాబాద్ తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. అయితే అంతదూరం రావడానికి వారికి ఆర్థిక స్థోమత కూడ లేకపోవడంతో ఆసుపత్రిలోనే ప్రసవవేదన పడుతుంది. అయితే ఇదే విషయమై ఆసుపత్రి సూపరిండెంట్ మాత్రం వైద్యులను ఒప్పించి ఆపరేషన్ చేస్తామని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments