Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రశాంత్ కిషోర్‌తో కొనసాగుతున్న సీఎం కేసీఆర్ చర్చలు

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (11:59 IST)
కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపిన ప్రశాంత్ కిషోర్ గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చలు జరుపుతున్నారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన ఈ చర్చలు ఆదివారం కూడా జరుగుతున్నాయి. ఇందులో రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై కూలంకుశంగా చర్చిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో తెరాస విజయావకాశాలపై వారు చర్చిస్తున్నారు. అలాగే, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. 
 
శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగాయి. ఆ రాత్రికి ప్రగతి భవన్‌లోనే బస చేసిన ప్రశాంత్ కిషోర్ ఆదివారం ఉదయం కూడా సీఎం కేసీఆర్‌తో మరో దఫా చర్చించనున్నారు. వచ్చే ఎన్నికల కోసం తెరాసతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్న పీకే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై తన బృందంతో సర్వే చేయించారు. 
 
ఈ సందర్భంగా 30 నియోజకవర్గాల్లో జరిపిన సర్వే వివరాలను ఆయన సీఎం కేసీఆర్‌‍కు అందించారు. ఆ తర్వా 89 నియోజకవర్గాల్లో జరిపిన సర్వే వివరాలను సీఎం కేసీఆర్‌కు తాజాగా అందించినట్టు తెలుస్తోంది. పైగా, సీఎం కేసీఆర్‌తో ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పని చేస్తానని ఈ సందర్భంగా పీకే స్పష్టం చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments