Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్ఐ - కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కారు

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (10:18 IST)
ఎస్.ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రిలిమ్స్ పరీక్షలో వివాదాస్పదమైన ఏడు ప్రశ్నల విషయంలో ఉదారంగా స్పందించింది. ఈ ఏడు ప్రశ్నలకు మార్కులు వేయాలని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) తాజాగా నిర్ణయం తీసుకుంది. 
 
కాగా, ప్రిలిమ్స్‌లో తప్పు ప్రశ్నలపై పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వారు ఆందోళనకు కూడా దిగారు. బీజేవైఎం శ్రేణులు కూడా పోలీసు ఉద్యోగ అభ్యర్థులకు అండగా నిలించారు. దీంతో దిగివచ్చిన బోర్డు.. కొత్తగా ప్రశ్నలకు మార్కులు జోడించి, ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల జాబితాను ఈ నెల 30వ తేదీ లోపు వెబ్‌సైట్‌లో ఉంచుతామని ఏ ప్రకటనలో తెలిపింది. 
 
ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు పార్ట్-2 కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. అయితే, ఇదివరకే పీఈటీ, పీఎంటీ టెస్టులో అర్హత సాధించిన వారు పార్ట్-2కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని వివరించింది. పార్ట్-2 దరఖాస్తులు ఫిబ్రవరి ఒకటో తేదీన నుంచి ఫిబ్రవరి 5వ తేదీ లోపు సమర్పించాల్సి ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతార సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..

Karthik Raju: సరికొత్తగా విలయ తాండవం వుంటుందన్న కార్తీక్ రాజు

Nani 34: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ చిత్రం ప్రారంభం

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హీరోగా పురుష చిత్రీకరణ పూర్తి

NBK 111: నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం దసరా కు ముహూర్తం.. అక్టోబర్ 24న షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments