ఓ కానిస్టేబుల్ అక్రమ వసూళ్లు... ట్విట్టర్‌ ద్వారా స్పందించిన డీజీపీ

Webdunia
శనివారం, 10 ఆగస్టు 2019 (21:29 IST)
కానిస్టేబుల్‌ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. వర్ధన్నపేట పోలీసుస్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు ఉన్న వీడియోను షేర్‌ చేస్తూ వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ రవీందర్‌ను విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన ట్విట్టర్‌ ద్వారా ఆదేశించారు. 
 
ఇటీవల రెండు రోజుల క్రితం వర్ధన్నపేట సీఐ ఇసుక ర్యాంపులు, మద్యం దుకాణాలపై మామూళ్లు వసూలు చేస్తున్నట్లు సీపీ దృష్టికి వెళ్లడంతో అతనికి మెమో జారీ చేసినప్పటికీ, అదే స్టేషన్‌ పరిధిలో ఓ కానిస్టేబుల్‌ అక్రమ వసూళ్ల వీడియో వైరల్‌ కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
 
ఆ వీడియోలో ఇసుక ట్రాక్టర్ల యాజమానుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయమై వర్ధన్నపేట ఏసీపీ మధుసూదన్‌ను వివరణ కోరగా ఉన్నతాధికారుల నుంచి విచారణ చేపట్టాలని ఉత్తర్వులు అందినట్లు పేర్కొన్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: మార్చి నెల ఉస్తాద్ గబ్బర్ సింగ్‌కు కలిసి వచ్చేలా వుంది

Sathya: నాగ చైతన్య చిత్రం వృషకర్మ లో సత్య లుక్‌

Srinath: మెన్షన్ హౌస్ మల్లేష్ నిజాయితీగా తీసిన సినిమా: శ్రీనాథ్ మాగంటి

Anantha Sriram: యూత్ కి ఒక యాంథమ్ లాగా ఉండాలనే రై రై రారా. పాట రాశాం : అనంత శ్రీరామ్

Bandla Ganesh: ఓటీటీ వద్దని సాయి, నితిన్‌కు ఫోన్‌ చేసి థియేటర్‌లో చేయమని చెప్పా : బండ్ల గణేష్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తర్వాతి కథనం
Show comments