ఓ కానిస్టేబుల్ అక్రమ వసూళ్లు... ట్విట్టర్‌ ద్వారా స్పందించిన డీజీపీ

Webdunia
శనివారం, 10 ఆగస్టు 2019 (21:29 IST)
కానిస్టేబుల్‌ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. వర్ధన్నపేట పోలీసుస్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు ఉన్న వీడియోను షేర్‌ చేస్తూ వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ రవీందర్‌ను విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన ట్విట్టర్‌ ద్వారా ఆదేశించారు. 
 
ఇటీవల రెండు రోజుల క్రితం వర్ధన్నపేట సీఐ ఇసుక ర్యాంపులు, మద్యం దుకాణాలపై మామూళ్లు వసూలు చేస్తున్నట్లు సీపీ దృష్టికి వెళ్లడంతో అతనికి మెమో జారీ చేసినప్పటికీ, అదే స్టేషన్‌ పరిధిలో ఓ కానిస్టేబుల్‌ అక్రమ వసూళ్ల వీడియో వైరల్‌ కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
 
ఆ వీడియోలో ఇసుక ట్రాక్టర్ల యాజమానుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయమై వర్ధన్నపేట ఏసీపీ మధుసూదన్‌ను వివరణ కోరగా ఉన్నతాధికారుల నుంచి విచారణ చేపట్టాలని ఉత్తర్వులు అందినట్లు పేర్కొన్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments