Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో హవాలా మనీ పట్టివేత - మంత్రి జగదీష్ కారులో తనిఖీలు

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2022 (15:33 IST)
హైదరాబాద్ నగరంలో మరోమారు భారీగా హవాలా నగదును పట్టుకున్నారు. గత నాలుగు రోజుల్లో జూబ్లీహిల్స్‌లో భారీగా హవాలా నగదును పట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నగరంలో మరోమారు భారీగా హవాలా నగదు పట్టుబడింది. 
 
గాంధీనగర్ లో నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి ఆధారాలు, నగదుకు సంబంధించిన రశీదులు లేకపోవడంతో రూ.3.5 కోట్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో అక్రమంగా నగదు తరలిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
 
ఇదిలావుంటే, తెలంగాణ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి కారును పోలీసులు తనిఖీ చేశారు. ఈ ఘటన న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో జరిగింది. మునుగోడు ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. 
 
ఈ క్రమంలో మునుగోడు ప్రాంతంలో ప్రత్యేక పికెట్‌ను ఏర్పాటు చేసి వాహనాలను చెక్ చేస్తున్నారు. ఆ సమయంలో మునుగోడు వైపు వెళుతున్న మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి వాహ‌నాన్ని క్షుణ్ణంగా త‌నిఖీ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని.. అందుకు తాను సహకరిస్తానని మంత్రి తనిఖీ బృందంతో చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments