Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్డౌన్ రూల్స్ బ్రేక్ : బీజేపీ అధ్యక్షుడిపై తెలంగాణ పోలీసుల కేసు

Webdunia
బుధవారం, 13 మే 2020 (10:19 IST)
తెలంగాణ రాష్ట్ర శాఖ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్‌పై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్డౌన్ రూల్స్ ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. 
 
లాక్‌డౌన్ నిబంధనల్లో భాగమైన భౌతిక దూరాన్ని పాటించకపోవడమే కాకుండా, అనేక మంది అనుచరులను వెంటబెట్టుకుని తిరుగుతున్నారన్న ఆరోపణలు చేసిన పోలీసులు.. ఆయనపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఆయనతోపాటు మరికొందరు నేతలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.
 
కాగా, మంగళవారం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బండి సంజయ్ పర్యటించారు. జిల్లాలోని పెద్దవూర మండలం ఊట్లపల్లిలో బత్తాయి రైతులను పరామర్శించి వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు.
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, బత్తాయి దిగుబడి సరిపడా లేకపోవడంతో పెట్టుబడి కూడా రావడం లేదని అన్నారు. రైతుల వద్ద నుంచి ప్రభుత్వమే బత్తాయిలు కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు.
 
ఆ సమయంలో బండి సంజయ్‌తో పాటు.. ఆయన అనుచరులు లాక్డౌన్ రూల్స్, సామాజిక భౌతికదూరం నిబంధనలను గాలికి వదిలివేశారని ఆరోపిస్తూ, పెద్దవూర పోలీసులు బీజేపీ నేతలపై 188 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments