Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్డౌన్ రూల్స్ బ్రేక్ : బీజేపీ అధ్యక్షుడిపై తెలంగాణ పోలీసుల కేసు

Webdunia
బుధవారం, 13 మే 2020 (10:19 IST)
తెలంగాణ రాష్ట్ర శాఖ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్‌పై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్డౌన్ రూల్స్ ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. 
 
లాక్‌డౌన్ నిబంధనల్లో భాగమైన భౌతిక దూరాన్ని పాటించకపోవడమే కాకుండా, అనేక మంది అనుచరులను వెంటబెట్టుకుని తిరుగుతున్నారన్న ఆరోపణలు చేసిన పోలీసులు.. ఆయనపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఆయనతోపాటు మరికొందరు నేతలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.
 
కాగా, మంగళవారం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బండి సంజయ్ పర్యటించారు. జిల్లాలోని పెద్దవూర మండలం ఊట్లపల్లిలో బత్తాయి రైతులను పరామర్శించి వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు.
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, బత్తాయి దిగుబడి సరిపడా లేకపోవడంతో పెట్టుబడి కూడా రావడం లేదని అన్నారు. రైతుల వద్ద నుంచి ప్రభుత్వమే బత్తాయిలు కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు.
 
ఆ సమయంలో బండి సంజయ్‌తో పాటు.. ఆయన అనుచరులు లాక్డౌన్ రూల్స్, సామాజిక భౌతికదూరం నిబంధనలను గాలికి వదిలివేశారని ఆరోపిస్తూ, పెద్దవూర పోలీసులు బీజేపీ నేతలపై 188 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఆయన ఆశీస్సులు వున్నంతకాలం నన్నెవరూ ఆపలేరు : ఎన్.టి.ఆర్.

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments