Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే నెలలో భాగ్యనగరికి వస్తున్న ప్రధాని.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 27 మార్చి 2023 (13:36 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెలలో హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. ఏప్రిల్ 8వ తేదీన భాగ్యనగరికి వచ్చే ఆయన... సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య వందే భారత్ రైలు సేవలను జెండా ఊపి ప్రారంభిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సికింద్రాబాద్ - విశాఖపట్టణం ప్రాంతాల మధ్య ఈ వందే భారత్ రైలు నడుస్తున్న విషయం తెల్సిందే. ఇపుడు కొత్తగా మరో రైలును తెలుగు రాష్ట్రాల్లో నడుపనున్నారు. అయితే, సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య నడిపే వందే భారత్ రైలు ప్రయాణ సమయం, చార్జీలను దక్షిణ మధ్య రైల్వే బహిర్గతం చేయాల్సివుంది.
 
ఇదిలావుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకు, ప్రధాని మోడీకి ఏమాత్రం పొసగడం లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అలాగే, ఈ రెండు పార్టీల నేతల మధ్య కూడా మాటల యుద్ధం సాగుతోంది. గతంలో ప్రధాని హైదరాబాద్ నగరానికి వచ్చినపుడు కూడా ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ ఎయిర్‌పోర్టుకు కూడా వెళ్లని విషయం తెల్సిందే. మరి ఈ దఫా ఎలా చేస్తారో వేచి చూడాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments