చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించనున్న ప్రధాని మోడీ

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (17:47 IST)
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ చారిత్మాత్మక కట్టడమైన చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఆయన ప్రత్యేక పూజలు చేస్తారు. 
 
ఢిల్లీ వేదికగా బీజేపీ కార్పొరేటర్ల సదస్సు జరిగింది. ఇందులో ప్రధాని మోడీ సైతం పాల్గొన్నారు. ఈ సంద్భంగా ఆయన పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్య పరిష్కారానికి ప్రతి ఒక్క కార్పొరేటర్ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
 
అయితే, హైదరాబాద్ నగరానికి చెందిన కార్పొరేటర్లు ప్రధానికి ఓ వినతి చేశారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే టిక్కెట్లు సాధించుకోవాలనే కలను నెరవేర్చుకునేందుకు కృషి చేయాలని కార్పొరేటర్లను ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. 
 
దీంతో వచ్చే నెల 2వ తేదీన హైదరాబాద్ నగరానికి వచ్చే ప్రధాని మోడీ ఆయన భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మోడీ చేసిన సూచనలు కార్పొరేటర్లలో ఉత్సాహాన్ని పెంచాయి. ప్రధాని హైదరాబాద్ పర్యటన పనులకు సంబంధించిన ఏర్పాట్లను ఆ పార్టీ నేతలు ఇప్పటి నుంచే ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments