Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్ - విశాఖల మధ్య వందే భారత్ రైలు : మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (09:03 IST)
త్వరలో తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైలు పరుగులు పెట్టనుంది. భారతీయ రైల్వే శాఖ తెలంగాణ రాష్ట్రానికి ఒక వందే భారత్ రైలును కేటాయించింది. ఈ రైలు సేవలను ఈ నెల 19వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రారంభించనున్నారు. ఈ రైలు తొలుత సికింద్రాబాద్ - విజయవాడల మధ్యే నడుపుతారంటూ వార్తలు వచ్చాయి. 
 
అయితే, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాత్రం.. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం వరకు నడుస్తుందని తెలిపారు. ఈ వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖ, విశాఖ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య నడుస్తుందన్నారు. 
 
ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బయలుదేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖకు చేరుకుంటుందని తెలిపారు. కాగా, ఈ నెల 19వ తేదీన ఈ రైలు సేవలకు ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు. కాగా, ఇది దేశంలో ప్రారంభమయ్యే ఎనిమిదో వందే భారత్ రైలు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments