Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాకీ దుస్తులను చూసి గర్వపడాలి: ప్రధాని మోదీ

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (19:00 IST)
యోగా, ప్రాణాయామం.. ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్‌ అకాడమీలో జరుగుతున్న ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పెరేడ్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ పాల్గొన్నారు.
 
ఐపీఎస్‌ ప్రొబేషనర్లను ఉద్దేశించి ప్రధాని స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు. ‘‘మనసులోనూ యోగా చేయడం చాలా మంచి పద్ధతి. ప్రజాసేవలో ఉండే అధికారులు పనిభారం, ఒత్తిడి ప్రభావం ఆరోగ్యంపై పడకుండా చిట్కాలు పాటాంచాలి. కరోనా సంకట పరిస్థితుల్లో పోలీసుల సేవలు ప్రశంసనీయం.
 
కరోనా కట్టడిలో ముందుండి పోరాడుతున్నారు. ఖాకీ దుస్తులను చూసి గర్వపడాలి’’ అని మోదీ పేర్కొన్నారు. మొత్తం 131 మంది ఐపీఎస్‌లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరిలో 11 మందిని తెలంగాణకు, ఐదుగురిని ఏపీకి కేటాయించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments