Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యనగరిలో మూడు రోజులు మకాం వేయనున్న ప్రధాని మోడీ

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (16:39 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ నగరంలో మూడు రోజుల పాటు బస చేయనున్నారు. ఆయనతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఇక్కడే ఉండనున్నారు. తెలంగాణా రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా దృష్టిసారించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ గడ్డపై మరింతగా బలం పెంచుకోవాలన్న ఉద్దేశ్యంతో బీజేపీ నేతలు తెలంగాణాపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. 
 
ఇదిలావుంటే, ఈ నెల 15వ తేదీపైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ నగరంలో నిర్వహించేలా ప్లాన్ చేశారు. మూడు రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించనుంది. ఈ సమావేశాలకు ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. 
 
అలాగే, ఈ కార్యవర్గ సమావేశాలకు దేశం నలు మూలల నుంచి దాదాపు 300 నుంచి 500 మంది ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. అయితే, ఈ సమావేశాలను హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లేదా నోవాటెల్ లేదా తాజ్‌కృష్ణ నక్షత్ర హోటళ్లలో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. భద్రతగా  పరంగా అన్ని అంశాలను పరిగణలోని తీసుకున్న తర్వాత ఈ కార్యవర్గ సమావేశాలు జరిగే వేదికను ఖరారు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments