Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఐ తాత్కాలిక డైరెక్టరుగా తెలుగు బిడ్డ... అలోక్ వర్మపై వేటు

Webdunia
బుధవారం, 24 అక్టోబరు 2018 (09:37 IST)
దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ తాత్కాలిక కొత్త డైరెక్టరుగా తెలుగు బిడ్డ నియమితులయ్యారు. తెలంగాణా రాష్ట్రానికి చెందిన మన్నెం నాగేశ్వరరావును ఈ పదవిలో నియమించారు. ఈ మేరకు డీవోపీటీ ఉత్తర్వులు జారీచేసింది. ఈయన తక్షణమే విధుల్లో చేరనున్నారు. ప్రస్తుతం ఆయన సీబీఐలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 
 
సీబీఐలో డైరెక్టర్‌, స్పెషల్ డైరెక్టర్ మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెల్సిందే. దీంతో స్పెషల్ డైరెక్టర్ ఆస్థానా జట్టుకు చెందిన డీఎస్పీ స్థాయి అధికారిని సీబీఐ అరెస్టు చేసింది. ఈ అంతర్గత పోరుపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. ఆ తర్వాత సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను ప్రధాని మోడీ తప్పించారు. అలాగే, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ వర్మా ఆస్థానాలను సెలవుపై ఇంటికి పంపించారు. ఆ తర్వాత సీబీఐ తాత్కాలిక డైరెక్టరుగా నాగేశ్వర రావుకు బాధ్యతలు అప్పగించారు. 
 
కాగా, 1986 బ్యాచ్‌కు చెందిన నాగేశ్వరరావు.. ఒడిశా కేడర్‌లో విధులు నిర్వర్తించారు. గతంలో ఒడిశా డీజీగా కూడా పనిచేశారు. విజయరామారావు తర్వాత తెలంగాణ అధికారికి సీబీఐ డైరెక్టర్ అవకాశం వచ్చింది. నాగేశ్వరరావు స్వస్థలం వరంగల్ జిల్లా మండపేట మండలం బోర్‌నర్సాపూర్ గ్రామానికి చెందిన నాగేశ్వరరావు ఏడాదిన్నరగా సీబీఐలో జాయింట్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments