Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఐ తాత్కాలిక డైరెక్టరుగా తెలుగు బిడ్డ... అలోక్ వర్మపై వేటు

Webdunia
బుధవారం, 24 అక్టోబరు 2018 (09:37 IST)
దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ తాత్కాలిక కొత్త డైరెక్టరుగా తెలుగు బిడ్డ నియమితులయ్యారు. తెలంగాణా రాష్ట్రానికి చెందిన మన్నెం నాగేశ్వరరావును ఈ పదవిలో నియమించారు. ఈ మేరకు డీవోపీటీ ఉత్తర్వులు జారీచేసింది. ఈయన తక్షణమే విధుల్లో చేరనున్నారు. ప్రస్తుతం ఆయన సీబీఐలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 
 
సీబీఐలో డైరెక్టర్‌, స్పెషల్ డైరెక్టర్ మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెల్సిందే. దీంతో స్పెషల్ డైరెక్టర్ ఆస్థానా జట్టుకు చెందిన డీఎస్పీ స్థాయి అధికారిని సీబీఐ అరెస్టు చేసింది. ఈ అంతర్గత పోరుపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. ఆ తర్వాత సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను ప్రధాని మోడీ తప్పించారు. అలాగే, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ వర్మా ఆస్థానాలను సెలవుపై ఇంటికి పంపించారు. ఆ తర్వాత సీబీఐ తాత్కాలిక డైరెక్టరుగా నాగేశ్వర రావుకు బాధ్యతలు అప్పగించారు. 
 
కాగా, 1986 బ్యాచ్‌కు చెందిన నాగేశ్వరరావు.. ఒడిశా కేడర్‌లో విధులు నిర్వర్తించారు. గతంలో ఒడిశా డీజీగా కూడా పనిచేశారు. విజయరామారావు తర్వాత తెలంగాణ అధికారికి సీబీఐ డైరెక్టర్ అవకాశం వచ్చింది. నాగేశ్వరరావు స్వస్థలం వరంగల్ జిల్లా మండపేట మండలం బోర్‌నర్సాపూర్ గ్రామానికి చెందిన నాగేశ్వరరావు ఏడాదిన్నరగా సీబీఐలో జాయింట్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

AI : సినిమాల్లో ఎ.ఐ. వాడకం నష్టమే కల్గిస్తుంది : అల్లు అరవింద్, ధనుష్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments