Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సీబీఐ మాజీ జేడీ

పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సీబీఐ మాజీ జేడీ
, శనివారం, 6 అక్టోబరు 2018 (13:58 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. ప్రస్తుతం ఈయన  తన ఉద్యోగానికి స్వచ్చంధ విరమణ చేశారు. ప్రస్తుతం ప్రజలను చైతన్య వంతులు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటూ, సమాజసేవలో పాలు పంచుకుంటున్నారు.
 
అయితే, ఈయన త్వరలోనే రాజకీయ ప్రవేశం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇపుడు తన పొలిటికల్ ఎంట్రీపై ఆయన క్లారిటీ ఇచ్చారు. త్వరలో తన ప్రణాళిక తెలియజేస్తానని చెప్పారు. తిరుపతిలో ఏర్పాటు ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. తన ఆలోచనలతో ఏకీభవించే వారితో కలిసి ముందుకెళ్తానని చెప్పారు. 
 
ఏపీలోని 13 జిల్లాలు పర్యటించి ప్రజల సమస్యలు, వాటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకున్నానని తెలిపారు. స్మార్ట్ సిటీలు కాదు.. మొదట స్మార్ట్ విలేజ్‌లు కావాలన్నారు. మండలానికి కాదు గ్రామానికో అధికారి ఉండలన్నారు. ప్రతి జిల్లాకో వ్యవసాయ పాలసీ ఉండాలని చెప్పారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ రావాలని ఆకాంక్షించారు. గ్రామీణాభివృద్ధిలో పనిచేయాలని అనుకున్నాను.. కానీ పోలీస్ శాఖకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియురాలిని వేధించాడనీ టీచర్‌ను కాల్చిచంపిన బీటెక్ స్టూడెంట్