ట్యాంక్ బండ్‌పై కారు బీభత్సం.... డివైడర్ ఢీకొని...

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (12:58 IST)
హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్‌పై ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్ మార్గ్‌లో ఓ కారు అదుపుతప్పి హుస్సేన్ సాగర్ డివైడర్‌ను డీకొంది. ఈ ప్రమాదంలోకారులోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
 
అతివేగంతో కారు ప్రయాణించడంతో ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి అదుపుతప్పి, హుస్సేన్ సాగర్ డివైడర్‌ను ఢీకొట్టి, రెయిలింగ్ మీదకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో కారు హుస్సేన్ సాగర్‌లో పడిపోయే ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఇక ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. 
 
ఈ ప్రమాదం జరిగిన వెంటనే అందులోని ప్రయాణికులు కారును వదిలేసి పారిపోయారు. ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు... వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కానును తనిఖీ చేయగా, కారులో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక మద్యం మత్తులో కారు నడిపి, ఈ ప్రమాదానికి కారణమైనట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments