దయచేసి బయటకు రావొద్దు .. కిషన్ రెడ్డి :: ఓయూ పరీక్షలు వాయిదా

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (09:12 IST)
హైదరాబాద్ నగరంరో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. 
 
గత రెండు రోజులుగా హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో నగరం మొత్తం నీట మునిగింది. ఎపుడు వరద నీరు ప్రాంతాలు సైతం ఇపుడు జలదిగ్బంధనంలో చిక్కుకునివున్నాయి. 
 
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నెలకొన్న పరిస్థితులపై మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే, వివిధ ప్రమాదాల్లో అనేక మంది మరణించటం బాధాకరమన్నారు. పిల్లలు, వృద్ధులు ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని కోరారు. 
 
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం కేంద్ర బృందాలను, పారామిలిటరీని పంపించటానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు.... అధికారుల సూచనలు పాటించాలన్నారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. 
 
మరోవైపు, తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న అన్ని రకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ ఎగ్జామినేషన్స్‌ కంట్రోలర్‌ ప్రొ. శ్రీరాం వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments