Webdunia - Bharat's app for daily news and videos

Install App

దయచేసి బయటకు రావొద్దు .. కిషన్ రెడ్డి :: ఓయూ పరీక్షలు వాయిదా

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (09:12 IST)
హైదరాబాద్ నగరంరో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. 
 
గత రెండు రోజులుగా హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో నగరం మొత్తం నీట మునిగింది. ఎపుడు వరద నీరు ప్రాంతాలు సైతం ఇపుడు జలదిగ్బంధనంలో చిక్కుకునివున్నాయి. 
 
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నెలకొన్న పరిస్థితులపై మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే, వివిధ ప్రమాదాల్లో అనేక మంది మరణించటం బాధాకరమన్నారు. పిల్లలు, వృద్ధులు ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని కోరారు. 
 
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం కేంద్ర బృందాలను, పారామిలిటరీని పంపించటానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు.... అధికారుల సూచనలు పాటించాలన్నారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. 
 
మరోవైపు, తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న అన్ని రకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ ఎగ్జామినేషన్స్‌ కంట్రోలర్‌ ప్రొ. శ్రీరాం వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments