Webdunia - Bharat's app for daily news and videos

Install App

విపక్ష నేతలు దొంగలన్నట్టుగా కేంద్ర పెద్దల తీరుంది : కేశవ రావు

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (16:19 IST)
కేంద్రంలో అధికారంలో ఉన్నవారు సచ్ఛీలులు, విపక్షంలో ఉన్నవారు దొంగలు అన్నట్టుగా కేంద్ర పాలకుల వ్యవహారశైలి ఉందని తెరాస రాజ్యసభ సభ్యుడు కె.కేశవ రావు ఆరోపించారు. పైగా, దేశంలో జీ-20 సదస్సును నిర్వహించడం పెద్ద గొప్పేమి కాదన్నారు. 
 
ఆయన మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆయన ఆరోపించారు. విపక్ష నేతలపై ఐటీ, ఈడీ, సీబీఐ వంటి సంస్థలతో దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తుందన్నారు. ప్రతిపక్షాల నేతలు దొంగలు, తాము మంచివాళ్ళం అనే విధంగా కేంద్రం పెద్దలు మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. 
 
ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సభా సమావేశాల్లో 50 శాతం సమయాన్ని ప్రజా సమస్యలపై చర్చించేందుకు కేటాయించాలని ఆయన కోరారు. అదేసమయంలో జీ-20 సదస్సును నిర్వహించడం గొప్ప విషయమేమీ కాదన్నారు. 
 
ఇదిలావుంటే, పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో తెరాస ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు. బొగ్గు కేటాయింపులతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పట్టుబట్టాలని చెప్పారు. అలాగే, విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకునిరావాలని ఆయన సొంత పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments