Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ పాజిటివ్ వృద్ధురాలు, ఆంబులెన్స్ నుంచి దిగి పరార్

Webdunia
శనివారం, 25 జులై 2020 (16:24 IST)
కరోనావైరస్ సోకిన ఓ వృద్ధురాలు చికిత్స కోసం ఆస్పత్రికి రానంటూ హల్చల్ చేసింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో చోటుచేసుకున్నది. వివరాలిలా వున్నాయి. శంకరపట్నం మండలంలో ఓ గ్రామానికి చెందిన వృద్ధురాలికి ఇటీవల కరోనావైరస్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
 
దీంతో చికిత్స కోసం ఆమెను ఆంబులెన్స్‌లో కరీంనగర్ ఆస్పత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేసారు. ఐతే తను ఆస్పత్రికి రానని సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. చివరకు ఎలాగో ఆంబులెన్స్ ఎక్కిన ఆ వృద్దురాలు మార్గమద్యమంలో  మలవిసర్జన కోసమని చెప్పి ఆంబులెన్స్ నుండి దిగి పారిపోయింది.
 
ఆ వృద్దురాలు తిరిగి శంకరపట్నం వెళ్లిందని తెలుసుకున్న అధికారులు ఆంబులెన్స్ తీసుకెళ్లగా తాను రానని మొరాయించింది. దాదాపు గంటసేపు అధికారులను ముప్పుతిప్పలు పెట్టించి చివరకు అంగీకరించింది. దీనితో అధికారులు ఊపిరి పీల్చుకొని వృద్దురాలిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments