Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ధిపేట జిల్లాలో విషాదం: ఇంట్లో చితి పేర్చుకుని కిరోసిన్ పోసుకుని..?

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (15:47 IST)
సిద్ధిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇంటిని, ఒంటరిగా ఉంటున్నాడనే కారణంతో అధికారులు మళ్లీ తిరిగి తీసేసుకోవటంతో వృధ్ధుడు చితి పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. తొగుట మండలం, వేములఘాట్‌కు చెందిన మల్లారెడ్డి (70) భార్య చనిపోయి ఒంటరిగా జీవిస్తున్నాడు. కూతురు కుమారుడు, అప్పుడప్పుడు తాత వద్దకు వచ్చి వెళుతూ ఉండేవాడు. మల్లారెడ్డి ఉంటున్న ఇల్లు మొత్తం మల్లన్నసాగర్ ప్రాజెక్టులో పోయింది.
 
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్‌రూం ఇంటికి దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు ఆయనకు ఇల్లు మంజూరు చేశారు. మల్లారెడ్డి అందులో జీవించసాగాడు. కానీ…. ఒంటరి వాడు అనే కారణంతో, ఇచ్చిన ఇంటిని అధికారులు వెనక్కు తీసుకున్నారు.
 
అధికారులు ఇంటిని ఖాళీ చేయించారనే కారణంతో మల్లారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గురువారం అర్ధరాత్రి తను నివాసం ఉండే ఇంట్లో చితి పేర్చుకుని… కిరోసిన్ పోసుకుని అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మల్లారెడ్డి మనవడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments