Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుక్ మై షో, పేటీఎంలకు షాకిచ్చిన కేసీఆర్ సర్కారు

Webdunia
శనివారం, 21 సెప్టెంబరు 2019 (14:48 IST)
సామాన్యుడి జేబులను ఖాళీ చేస్తున్న ఆన్‌లైన్ బుకింగ్ యాప్స్‌పై తెలంగాణ సర్కారు షాక్ ఇచ్చింది. రకరకాల టాక్స్‌లను టిక్కెట్లపై రుద్దుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న ఈ సైట్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
 
బుక్ మై షో, పేటిఎం,ఈజీ మూవీస్ పేరుతో ఇప్పటికే వివిధ రకాల టాక్స్‌లను సినిమా టిక్కెట్ల రేట్లకు జోడించి సామాన్యుల నుంచి విపరీతంగా దోచేస్తున్నారు. ఇకపై దీనికి చెక్ పెడుతూ ఫిలిం ఫెడరేషన్ కార్పొరేషన్ టిక్కెట్ల అమ్మకాల కోసం ప్రత్యేక వెబ్ సైట్‌ను త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం తీసుకురానుంది.
 
మరోవైపు తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో పద్దులపై చివరి రోజు చర్చ జరుగుతోంది. గవర్నర్‌, మంత్రి మండలి, సాధారణ పరిపాలనా శాఖ, ఎన్నికల పద్దులపై చర్చించారు. సమాచారం-పౌర సంబంధాలు, శాసనవ్యవస్థ, న్యాయపాలన, ఆర్థిక, నిర్వహణ, ప్రణాళిక, సర్వే, గణాంకాల శాఖల పద్దులపై చర్చిస్తున్నారు. పద్దులను మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలు ప్రవేశపెట్టారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments