Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగిత్యాలలో ద్విచక్రవాహనదారులకు పెట్రోల్ బంద్.. ఎందుకు?

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (11:27 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాలలో ద్విచక్రవాహనదారులకు పెట్రోల్ విక్రయాన్ని బంద్ చేశారు. హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోయాలని లేనిపక్షంలో పెట్రోల్ విక్రయించవద్దని జిల్లా యంత్రాంగం కఠినమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో హెల్మెట్ లేని వాహనదారులు  తీవ్ర ఇక్కట్లు పడ్డారు. 
 
ఇటీవలి కాలంలో ఈ జిల్లాలో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో అనేక మంది ద్విచక్రవాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్‌ ధరించని వాహన దారులు ప్రమాదాల్లో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. 
 
ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా, జిల్లా కలెక్టర్‌ రవి ఆదేశాలతో అధికారులు, పెట్రోల్‌ బంకుల నిర్వాహకులు ‘నో హెల్మెట్‌- నో పెట్రోల్‌’ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. దీనిపై ఇటీవలే జిల్లా కలెక్టర్‌ రవి, అదనపు కలెక్టర్‌ రాజేశం జిల్లాలోని బంకు యజమానులు, అధికారులకు నిబంధలనపై పూర్తి అవగాహన కల్పించారు. 
 
దీనికి తోడు జిల్లా సివిల్‌ సప్లై అధికారి చందన్‌ కుమార్‌ తన బృందంతో కలిసి ప్రతి పెట్రోల్‌ బంకులో ‘హెల్మ్‌ట్‌ లేకుండా పెట్రోల్‌ పోయబడదు’ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మరో వైపు మైనర్లు వాహనాలు నడపకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రవి అధికారులకు సూచించారు. ప్రతి పెట్రోల్‌ బంక్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసి, ప్రతీ పదిహేను రోజులకొకసారి పెట్రోల్‌ పోసే విధానాన్ని పరిశీలించనున్నారు.   

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments