Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్ల చిన్నారిని చంపేసిన రెండు పాములు... ఎలా?

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (11:51 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. రెండు పాములు కలిసి మూడేళ్ల చిన్నారిని చంపేశాయి. దీంతో ఆ చిన్నారి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
జిల్లాలోని నవీపేట మండలం బినోల గ్రామానికి చెందిన మంగలి భూమేశ్‌, హర్షిత దంపతులకు కుమారుడు రుద్రాన్ష్ (రెండున్నర ఏళ్లు), మూడు నెలల కూతురు ఉన్నారు. ఇటీవలి వర్షాలకు వారి ఇంట్లోని ఓ గది కూలిపోయింది. 
 
దీంతో శుక్రవారం తల్లిదండ్రులు వారి పిల్లలతో కలిసి మరో గదిలో నిద్రించారు. అర్థరాత్రి సమయంలో ఇంటి పైనుంచి రెండు పాములు ఒకేసారి మంచంపై నిద్రిస్తున్న రుద్రాన్ష్‌పై పడింది. బాలుడి చేతికి చుట్టుకుని కాటేశాయి. కుమారుడు ఏడవడంతో మేల్కొన్న తల్లిదండ్రులు పాములను లాగి చంపేశారు.
 
ఆ తర్వాత హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించాడు. పాము కాటుకు చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

Sudeep: కిచ్చా సుదీప్ పాన్ ఇండియా మూవీ మార్క్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

ఉత్తర్ ప్రదేశ్ నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో నిశాంచి ట్రైలర్ విడుదల

Anupama : దెయ్యంలా వుంటావని అమ్మ తిడుతుండేది : అనుపమ పరమేశ్వరన్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

తర్వాతి కథనం
Show comments