Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్ల చిన్నారిని చంపేసిన రెండు పాములు... ఎలా?

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (11:51 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. రెండు పాములు కలిసి మూడేళ్ల చిన్నారిని చంపేశాయి. దీంతో ఆ చిన్నారి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
జిల్లాలోని నవీపేట మండలం బినోల గ్రామానికి చెందిన మంగలి భూమేశ్‌, హర్షిత దంపతులకు కుమారుడు రుద్రాన్ష్ (రెండున్నర ఏళ్లు), మూడు నెలల కూతురు ఉన్నారు. ఇటీవలి వర్షాలకు వారి ఇంట్లోని ఓ గది కూలిపోయింది. 
 
దీంతో శుక్రవారం తల్లిదండ్రులు వారి పిల్లలతో కలిసి మరో గదిలో నిద్రించారు. అర్థరాత్రి సమయంలో ఇంటి పైనుంచి రెండు పాములు ఒకేసారి మంచంపై నిద్రిస్తున్న రుద్రాన్ష్‌పై పడింది. బాలుడి చేతికి చుట్టుకుని కాటేశాయి. కుమారుడు ఏడవడంతో మేల్కొన్న తల్లిదండ్రులు పాములను లాగి చంపేశారు.
 
ఆ తర్వాత హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించాడు. పాము కాటుకు చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments