Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుగుల మందు తాగిన కుటుంబం... భర్త మృతి.. భార్య విషమం

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (12:00 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో విషాదకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఈ గ్రామానికి చెందిన సాయిలు (40) అనే వ్యక్తికి భార్య రేఖ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సాయిలు చేతికి అందిన చోటల్లా అప్పులు చేశాడు. వాటిని సకాలంలో తిరిగి చెల్లించలేక పోవడంతో అప్పులిచ్చిన వారు వేధించసాగారు. 
 
ఈ క్రమంలో బుధవారం రాత్రి భార్యాపిల్లలతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీన్ని గమనించిన ఇరుగుపొరుగువారు ఆ నలుగురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ సాయిలు ప్రాణాలు కోల్పోయాడు. రేఖ పరిస్థితి విషమంగా ఉంది. చిన్నారుల మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు వైద్యులు వెల్లడించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments