Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుగుల మందు తాగిన కుటుంబం... భర్త మృతి.. భార్య విషమం

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (12:00 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో విషాదకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఈ గ్రామానికి చెందిన సాయిలు (40) అనే వ్యక్తికి భార్య రేఖ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సాయిలు చేతికి అందిన చోటల్లా అప్పులు చేశాడు. వాటిని సకాలంలో తిరిగి చెల్లించలేక పోవడంతో అప్పులిచ్చిన వారు వేధించసాగారు. 
 
ఈ క్రమంలో బుధవారం రాత్రి భార్యాపిల్లలతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీన్ని గమనించిన ఇరుగుపొరుగువారు ఆ నలుగురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ సాయిలు ప్రాణాలు కోల్పోయాడు. రేఖ పరిస్థితి విషమంగా ఉంది. చిన్నారుల మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు వైద్యులు వెల్లడించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments