Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుగుల మందు తాగిన కుటుంబం... భర్త మృతి.. భార్య విషమం

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (12:00 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో విషాదకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఈ గ్రామానికి చెందిన సాయిలు (40) అనే వ్యక్తికి భార్య రేఖ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సాయిలు చేతికి అందిన చోటల్లా అప్పులు చేశాడు. వాటిని సకాలంలో తిరిగి చెల్లించలేక పోవడంతో అప్పులిచ్చిన వారు వేధించసాగారు. 
 
ఈ క్రమంలో బుధవారం రాత్రి భార్యాపిల్లలతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీన్ని గమనించిన ఇరుగుపొరుగువారు ఆ నలుగురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ సాయిలు ప్రాణాలు కోల్పోయాడు. రేఖ పరిస్థితి విషమంగా ఉంది. చిన్నారుల మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు వైద్యులు వెల్లడించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

రామ్ పోతినేని తన ప్రేయసికి అనుభవంలోంచి నువ్వుంటే చాలే.. గీతం రాశారా !

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments